Advertisementt

ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్..!

Mon 03rd Apr 2017 06:19 PM
jr ntr,jai lava kusha,kalyan ram,jr ntr new movie details,srirama navami  ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్..!
ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్..!
Advertisement
Ads by CJ

యంగ్ టైగర్ ఎన్టీఆర్ 'జనతా గ్యారేజ్' తర్వాత నెక్స్ట్ ప్రాజెక్ట్ చెయ్యడానికి బాగానే గ్యాప్ తీసుకున్నాడు. ఈ మధ్యలో ఎన్టీఆర్ ని డైరెక్ట్ చేస్తున్నారంటూ చాలామంది డైరెక్టర్స్ పేర్లు ప్రచారంలోకి వచ్చాయి. కానీ ఎన్టీఆర్, బాబీ చెప్పిన కథకి కనెక్ట్ అయిపోయి బాబీ డైరెక్షన్ లో సినిమాకి శ్రీకారం చుట్టాడు. బాబీ కాంబినేషన్ లో ఎన్టీఆర్ తన 27 వ చిత్రాన్ని తన అన్నయ్య కళ్యాణ్ రామ్ నిర్మాతగా మొదలుపెట్టేసి సెట్స్ మీదకెళ్ళాడు.

ఈ చిత్రంలో ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చెయ్యడం... ఈ చిత్రానికి టైటిల్ 'జై లవ కుశ' అని కూడా ప్రచారం జరుగుతుంది. ఈ చిత్రంలో ఎన్టీఆర్ కి జోడిగా రాశి ఖన్నాని ఎంపిక చెయ్యగా నివేత థామస్ ని రెండో హీరోయిన్ గా సమంత ని లీడింగ్ హీరోయిన్ గా సెలెక్ట్ చేసినట్లు వార్తలొస్తున్నాయి. అయితే షూటింగ్ మొదలెట్టినప్పటినుండి ఈ చిత్రం గురించి అనేక రకాల వార్తలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. అయితే షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ చిత్ర అధికారిక లోగోను ఈ శ్రీరామ నవమి కానుకగా విడుదల చెయ్యాలని కళ్యాణ్ రామ్ భావిస్తున్నాడట.

ఇదే విషయాన్ని కళ్యాణ్ రామ్ తన ట్విట్టర్ లో తెలియజేశాడు. ఏప్రిల్ 5 శ్రీరామ నవమి సందర్బంగా ఎన్టీఆర్ 27 లోగోను లాంచ్ చేస్తున్నాం అని అభిమానులకు తీపి వార్త అందించాడు కళ్యాణ్ రామ్. ఇక ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా ఆగష్టు లో ఈ చిత్ర విడుదలకు ప్లాన్ చేస్తున్నారు.

Advertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ